14న ఢిల్లీకి సీఎం..21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం..!

831
kcr kalwshwaram
- Advertisement -

తెలంగాణ వరప్రాదయని కాళేశ్వరం నుంచి గోదారి పరవళ్లు తొక్కనుంది. గోదావరి నీటిని గోదావరిలోనే ఎత్తిపోస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 21న సీఎం కేసీఆర్ పంపులను ఆన్ చేసి నీటి లిఫ్టింగ్‌ను ప్రారంభించనున్నారు.

ప్రాజెక్టు ప్రారంభానికి ఈనెల 20 నుంచి 25వ తేదీల మధ్య ఏర్పాట్లను చేయాల్సిందిగా ఇంజనీర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మేడిగడ్డ పంప్‌హౌజ్‌ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా.. కాఫర్‌ డ్యాంను ఏర్పాటు చేసి అవసరమైన నీటి మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంది. తర్వాత దానిని రెండు టీఎంసీలకు పెంచనున్నారు. ప్రస్తుతం గోదావరిపై నిర్మిస్తున్న మూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. జూలై చివరి, ఆగస్టు మొదటి వారంలోగా ఇది పూర్తయ్యే అవకాశం ఉంది.

గోదావరి నది ద్వారా మనకు వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలంటే గోదావరిపై విరివిగా బ్యారేజీలు నిర్మించడమే మార్గమని భావించారు కేసీఆర్. గోదావరి వరదలు వచ్చినప్పుడు మన బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేసుకోవాలి. గోదావరిలో నీటి లభ్యత లేకుంటే ప్రాణహిత నదీ జలాలను గోదావరిలోకి మళ్లించుకోవాలి. ఇదీ ప్రభుత్వ వ్యూహం. ఇందులోనుంచి పురుడు పోసుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు.

కాళేశ్వరం అందుబాటులోకి వస్తే ఇకపై రైతన్నలు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. నదికే నీళ్ళనిచ్చే జీవనదిగా మారనుంది కాళేశ్వరం . 1832 కిలోమీటర్‌ల పొడవునా, 190 టీఎంసీల గోదావరి జలాలను ఎతిు పోస్తూ 20 జిల్లాలకు ఉపయోగపడే లా డిజైన్ అయి 37లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు.

- Advertisement -