నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో కవిత ప్రత్యేకపూజలు

457
mp kavitha
- Advertisement -

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎంపీ కవిత. కార్తీక దీపాన్ని వెలిగించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత తెలిపారు.

ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం చేయడం జరిగిందన్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ప్రాచీనమైన చరిత్ర ఉన్నదని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కవిత వెంట ఆమె కుటుంబసభ్యులు, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఇక కార్తీక పౌర్ణమిని రాష్ట్ర ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉపవాస దీక్ష ఆచరించి శివాలయాల్లో, ఇండ్ల వద్ద దీపాలను వెలిగించారు.

trs

- Advertisement -