కాజ‌ల్ మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

620
kajal aggarwal
- Advertisement -

లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కాజల్ అగర్వాల్‌. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రహీరోలందరితో సినిమాలు చేసిన కాజల్‌…ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలోకి ఎంటరై 15 సంవత్సరాలు గడుస్తున్న తరగని అందంతో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తున్న బ్యూటీ కాజల్‌కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే.

సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మ కొలువుదీరింది. తానే స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్క‌రించారు కాజల్. గోల్డెన్ క‌ల‌ర్ డ్రెస్‌లో కాజ‌ల్ మైన‌పు విగ్ర‌హం నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. కాజల్‌తో పాటు ఆమె మైనపు విగ్రహాంతో ఫోటోలు దిగేందుకు స్ధానికులు క్యూ కడుతున్నారు.

ప్ర‌స్తుతం కాజ‌ల్ మైన‌పు విగ్ర‌హానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇప్పటికే టాలీవుడ్ నుంచి మహేష్,ప్రభాస్‌ల విగ్రహాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే.

agarwal

- Advertisement -