కరోనా నియంత్రణకు కేఏపాల్‌ ప్రార్ధన..!

438
ka paul
- Advertisement -

కరోనా నియంత్రణకు ప్రతిరోజు ప్రార్ధన చేస్తున్నాని తెలిపారు ప్రముఖ మత ప్రచారకర్త కేఏ పాల్ . తెలంగాణ,ఏపీల్లో తనకు సంబంధించిన నివాసాలను కరోనా బాధితుల కోసం వాడుకోవాలని సూచించారు. ఏపీలో విశాఖ దగ్గర,తెలంగాణలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చారిటి ట్రస్ట్ వెయ్యి ఎకరాల భూమిని వినియోగించుకోవాలన్నారు.

కరోనా తగ్గడానికి ప్రత్యేక ప్రార్ధన చేస్తున్నానని తెలిపారు. తన ట్రస్టుకు సంబంధించిన భూములు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని వాటిని కూడా ఉపయోగించుకోవాలన్నారు.

దేవుడు అన్యాయాన్ని సహించడని…దేవుడు సృష్టించిన విపత్తు ఇదన్నారు. తినడానికి తిండిలేక కోట్ల మంది అల్లాడుతున్నారని..దేవుడు యందు భయంతో,భక్తితో ఉండాలన్నారు.

- Advertisement -