సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

337
Junior Doctors
- Advertisement -

నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్డర్లు తలపెట్టిన సమ్మెను రాష్ట్ర జూనియర్ వైద్యులు విరమించారు. రాష్ట్ర వైద్యా శాఖ మంత్రి ఈటల రాజెందర్ వారితో మాట్లాడి వారి డిమాడ్లను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందేనన్నారు. కేంద్రంతో మాట్లాడతామని చెబుతామని హామి ఇచ్చారు.

తాము హామి ఇచ్చినట్లు గానే నిన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. వైద్యుల ప్రయోజనాలకు ఇబ్బంది కాబోదని చెప్పారన్నారు. జూనియర్ వైద్యులకు కేంద్రమంత్రితో చర్చల సారాంశాన్ని వివరించామన్నారు. నిబంధనల తయారీ సందర్భంలో అందరి అభిప్రాయాలు చెబుతామన్నారు. ప్రగతి నిరోధకంగా ఉన్న వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమ్మె విరమించాలని జూనియర్ వైద్యులను కోరితే సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -