2019..ఈ హీరోల ఫ్యాన్స్‌కు నిరాశే..!

559
nithin
- Advertisement -

2019..మరికొద్దిరోజుల్లో ఎండై కొత్త సంవత్సరం 2020కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఇక టాలీవుడ్ అగ్రహీరోలు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 2019లో కొంతమంది హీరోలు రెండు సినిమాలతో అలరించగా మరికొంతమంది మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.

వీరిలో ఎన్టీఆర్,అల్లు అర్జున్,నితిన్,రవితేజ,సుధీర్ బాబు వంటి హీరోలు ఉన్నారు. 2018లో అరవింద సమేత మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. దీంతో 2019 క్యాలెండర్ ఈయర్‌లో ఎలాంటి సినిమా చేయలేదు.

ఇక ప్రతి ఏడాది రెండు సినిమాలు చేసే మాస్ మహారాజా రవితేజ సైతం ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సినిమాలు చేయలేదు. వరుస అపజయాలు పలకరించడంతో చిన్న గ్యాప్ తీసుకొని ‘డిస్కో రాజా’, క్రాక్’ సినిమాలు చేస్తున్నాడు. 2020లో ఈ మూవీలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

ఇక అల్లు అర్జున్ సైతం 2019లో ఫ్యాన్స్‌కు నిరాశనే మిగిల్చాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న బన్నీ 2020లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నారు.

2019 క్యాలెండర్ ఈయర్‌లో సినిమా మిస్ అయిన హీరోల్లో నితిన్,సుధీర్ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న నితిన్ 2020లో కనీసం రెండు సినిమాలతో ముందుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా సుధీర్ బాబు సైతం V , పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాలతో సందడి చేయనున్నాడు. మొత్తంగా ఈ ఐదుగురు హీరోలు 2020లోనైనా ఎలాంటి ఫలితాన్ని రాబడతారో వేచిచూడాలి.

- Advertisement -