‘మిస్టర్‌ మజ్ను’ ప్రీ రిలీజ్‌.. అతిథిగా ఎన్టీఆర్‌‌!

294
Mr Majnu Pre-release
- Advertisement -

అక్కినేని హీరో అఖిల్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. గత సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేందుకు ఈ యంగ్‌ హీరో రెడీ అవుతున్నాడు. ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నడు. జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన ‘మిస్టర్‌ మజ్ను’ టీజర్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Mr Majnu Pre-release

అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను శనివారం ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ రాబోతున్నారు. ఈ విషయాన్ని అఖిల్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘త్వరలో మిమ్మల్ని కలుస్తాం. మాకు సపోర్ట్‌ చేస్తున్నందుకు తారక్‌ అన్నకు ధన్యవాదాలు. నీతో కలిసి స్టేజ్‌ పంచుకోవాలని నాకెంతో ఆతృతగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -