జియో ఫోన్ల డెలివరీ రేపటి నుంచే..!

214
JioPhone start on sunday
- Advertisement -

మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ రేపటి నుంచే మార్కెట్ లోకి రానుంది. ప్రీ-బుకింగ్స్‌ తోనే సంచలనం  సృష్టించిన జియో వినియోగదారుల నుంచి స్పందన అనూహ్యంగా ఉండటంతో  ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది.

తొలి విడతలో సుమారు 60 లక్షల మంది జియో ఫోన్లను బుక్ చేసుకున్నారు. ఈ ఫోన్ల డెలివరీ ఆదివారం(సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభంకానుంది. తొలి విడతలో బుకింగ్‌ అయిన ఫోన్లను 15 రోజుల వ్యవధిలోనే డెలివరీ చేయనుంది జియో.

జియోఫోన్ల ప్రీ బుకింగ్స్‌ గత నెల 24న ప్రారంభమైన విషయం తెలిసిందే. 500 రూపాయలు (ఫోన్‌ ధర రూ.1,500) చెల్లించి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ను బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. డెలివరీ సందర్భంగా మిగతా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుం ది. దాదాపు 60 లక్షల ఫోన్ల బుకింగ్స్‌ జరగడంతో వీటి బుకింగ్స్‌ను జియో నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు బుకింగ్స్‌ ప్రా రంభించే విషయాన్ని రిలయన్స్‌ జియో ప్రకటించలేదు.

- Advertisement -