మహానటికి స్వాగతం పలికిన జాన్వీ కపూర్‌..

248
- Advertisement -

కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్‌ నేను శైలజా మూవీతో తెలుగు తెరకు పరిచమైన విషయం తెలిసిందే. ఇక నటి సావిత్రి బయెపిక్ అయిన మహానటిలో తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రసుతం కీర్తి ఇటు టాలీవుడ్‌.. అటు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అంతేకాదు బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది కీర్తి.

ఈ బ్యూటీ తన తొలి బాలీవుడ్‌ చిత్రానికి ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్న ఓ బయోపిక్‌లో కీర్తి.. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది.

janvikapoor

ఇక అసలు విషయం ఏంటంటే.. కీర్తి నటనకు తాను ఫిదా అయిపోయానని శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ నటి జాన్వి కపూర్ తెలిపింది. ఈ సందర్భంగా తనకు కీర్తి సురేశ్‌ అంటే చాలా ఇష్టమని జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ కీర్తి ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘‘కీర్తి.. ‘మహానటి’ సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక కీర్తి నటిస్తున్న ఈ మూవీ ఫుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఉండబోతోందట. ఈ మూవీకి అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -