నేడు మీడియా ముందుకు పవన్ కళ్యాణ్…కీలక ప్రకటన

256
Pawan Kalyan
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల తర్వాత ఆయన మొదటి సారిగా మీడియా ముందుకు రానున్నారు. పార్టీ విభాగాలకు కమిటీలు నియమించారు. నేడు ఆ కమిటీ వివరాలను ఆయన మీడియా ముందు వివరించనునున్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన ఆయన.. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు రూపమిచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ప్రకటించబోయే కమిటీలలోపార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉండనున్నాయి.

- Advertisement -