దీపావళికి జగపతిబాబు ముద్ర విడుదల..

229
Jagapathi Babu
- Advertisement -

బ్లాక్ మనీ కారణంగా సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. రాజకీయ నాయకులు తాము ఎన్నికల్లో నెగ్గడం కోసం బ్లాక్ మనీని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సమాజ వ్యవస్థపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన విపరీత ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుని ముద్ర చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చిత్ర సమర్పకుడు నట్టి కుమార్ తెలిపారు. జగపతిబాబు కథానాయకుడిగా ఎన్.కె. దర్శకత్వంలో క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి సారధ్యంలో నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి.

Jagapathi Babu

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, బ్లాక్ మనీపై పోరాటం చేసే వ్యక్తిగా ఈ చిత్రంలో జగపతిబాబు కనిపిస్తారని చెప్పారు. రాజకీయ నాయకులు బ్లాక్ మనీని ఎలా సంపాదిస్తున్నారు..దానిని ఎన్నికల్లో ఎలా ఖర్చుపెడుతున్నారన్న అంశాన్ని ఈ చిత్రంలో చూపించామని ఆయన వివరించారు. ఇందులో మూడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయని అన్నారు. దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, రావురమేష్, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, సోనియా, జ్యోతి, ఆర్.కె., జబర్దస్త్ రాఘవ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ-ప్రసాద్ బాబు, సంగీతం-ఎం.ఎం.శ్రీలేఖ, ఎడిటింగ్-గౌతంరాజు, ఆర్ట్-రమణ, నిర్మాణ సారధ్యం-నట్టి క్రాంతి, సమర్పణ-నట్టి కుమార్, నిర్మాత-నట్టి కరుణ, దర్శకత్వం-ఎన్.కె.

- Advertisement -