టీటీడీ బ్రహ్మోత్సవాలకు రండి..కేసీఆర్‌కు జగన్ ఆహ్వానం

655
jagan
- Advertisement -

ఈనెల 28 నుంచి తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్‌. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన జగన్‌…బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి,ఎంపీలు ప్రభాకర్ రెడ్డి,మిథున్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై సమాలోచనలు జరపనున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదనలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -