రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌..

339
Rajamouli-DVV
- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ బిజిగా ఉండ‌టంతో మ‌రొకొద్ది రోజ‌ల్లో ఈప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే రాజ‌మౌళి తీయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ పై సోష‌ల్ మీడియాలో ప‌లు పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. 1995లో స‌ల్మాన్, షారుఖ్ ఖాన్ లు న‌టించిన క‌ర‌ణ్ అర్జున్ సినిమాను రాజ‌మౌళి రిమేక్ చేస్తున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

RRR

అలాగే రాజ‌మౌళి చేసిన మ‌రోసినిమా ఈగ లోని మ‌ళ్లి పుట్ట‌డం అనే కాన్సెప్ట్ తోనే సినిమా తీస్తున్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి. అయితే సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌ ఈ రూమ‌ర్ల‌పై స్పందించారు చిత్ర నిర్మాత డివీవీ దానయ్య. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లన్నీ అవాస్త‌వాలని..వాటిని ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఈసినిమాకు సంభిందించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్నారు. ఒక నెల రోజుల్లో ఈసినిమాపై అంద‌రికి పూర్తిగా అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్నారు.

RRR

ప్ర‌స్తుతం ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌ర‌గుతున్నాయ‌న్నారు. ఈసినిమాను ఎప్పుడు ప్రారంభిస్తామ‌నే విష‌యంపై కూడా క్లారిటి ఇచ్చారు నిర్మాత‌. ఈచిత్రానికి సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ ను అక్టోబ‌ర్ లో మొద‌లు పెట్టెందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ త‌ప్ప మిగ‌తా న‌టీన‌టుల‌ను ఎవ‌రిని ఎంపిక చేయ‌లేద‌న్నారు. ఒక నెల‌లోపు అన్ని ప‌నులు పూర్త‌యిపోతాయ‌న్నారు. దాదాపు రూ.300కోట్ల‌తో ఈసినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2020 వేస‌వి కాలంలో ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రాజ‌మౌళికి దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత రాజ‌మౌళి తీయ‌బోయే మ‌ల్టిస్లార‌ర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

- Advertisement -