ఐపీఎల్ విజేతకు ప్రైజ్‎మనీ ఎంతో తెలుసా..?

248
IPL-11
- Advertisement -

క్రికెట్ ప్రియులను అలరిస్తున్న ఐపీఎల్ నేటితో ముగియనుంది. నేడు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచేందుకు వాఖండే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. నేటి మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్న జట్టును సన్ రైజర్స్ కట్టడి చేస్తుందా..? లేక మెరుగైన బ్యాటింగ్  తో చెన్నై మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుందో చూడాలి ఇక.

IPL_2018_IPL

అయితే గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? అక్షరాల రూ.20 కోట్లు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో జట్టు కెప్టెన్ కి అందజేస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.12.5 కోట్ల అందుతుంది. ఇక ఈ సీజన్ లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్ కు రూ.10 లక్షల చెక్ తోపాటు ట్రోఫీని బహుకరిస్తారు. అలాగే ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఆటగాడికి రూ. 10 లక్షలు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పర్చుల్ క్యాప్ దక్కించుకొని రూ.10 లక్షలు అందుకోనున్నారు.

ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికైన ఆటగాడికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి.. భవిష్యత్తులో అంతర్జాతీయ స్టార్‌గా మారే అవకాశం ఉన్న ఆటగాణ్ని ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపిక చేస్తారు.

- Advertisement -