మొక్కలు నాటిన పారిశ్రామికవేత్త చిట్టూరి నరేంద్ర..

428
narender
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు పారిశ్రామిక వేత్త చిట్టూరి నరేంద్ర. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సురేందర్ రావు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి ఇవాళ తణుకు లో మొక్కలు నాటారు  నరేంద్ర.

రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపిన నరేంద్ర మరో ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు. తణుకు ఎమ్మెల్యే కనుమూరి వెంకటేశ్వరరావు ,మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ,ఎంపీ రఘురామ రాజులను మొక్కలు నాటాలని కొరారు.

- Advertisement -