ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్.. విరాళంగా వైద్య పరికరాలు

210
- Advertisement -

కరోనా చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు. తమ శక్తి మేరకు పలువురు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ 14 లక్షల విలువయిన వైద్య పరికరాలను గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు అందించటం జరిగింది.

మొత్తం 14 లక్షల వైద్య పరికారాల్లో 7 లక్షల రూపాయల పరికరాలు గాంధీ ఆస్పత్రికి, 7 లక్షల రూపాయల పరికరాలు నిలోఫర్‌కు కేటాయించారు. ఎన్95, పిపిఈ కిట్స్,ఏరో మిషన్లను ప్రభుత్వానికి అందించారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను జీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ ప్రతినిధులు కలిశారు.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ ప్రతినిధులు ప్రకిటించారు. మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన వాళ్లలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ అధ్యక్షులు సీఎన్ రెడ్డి, కార్యదర్శి భాస్కర్, ట్రెజరర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, అజయ్ లు ఉన్నారు.

- Advertisement -