టై గా ముగిసిన భారత్, వెస్టిండీస్ మ్యాచ్..

255
India vs West Indies
- Advertisement -

వైజాగ్‌లో జరగుతున్న భారత్‌ వెస్టిండీస్ రెండో వన్డే టైగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. అనంతరం 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

విండీస్ బ్యాట్స్ మెన్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. ఓపెనర్లు కీరన్ పావెల్(18), హేమ్ రాజ్(32) జోడీ శుభారంభాన్నిచ్చింది. ఆ తర్వాత వచ్చిన హోప్(123 నాటౌట్) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హోప్‌కు షిమ్రోన్ హిట్ మెయిర్(94) జతకలవడంతో భారత విజయ అవకాశాలు ఆవిరయ్యాయి.

- Advertisement -