టాస్ గెలిచిన విండీస్.. భారత్‌ బ్యాటింగ్‌..

287
- Advertisement -

నేడు భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య చెన్నైలో చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచిన విండీస్ మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో విండీస్ పై వన్డేల్లోనూ గెలవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. వన్డే సిరీస్ లోనైనా గెలవాలని వెస్టిండీస్ కసిగా ఉంది. ఓపెనర్స్‌గా రోహిత్‌ శర్మ,లోకేష్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 4 ఓవర్లలో 11 పరుగులతో కొన్నసాగుతున్నారు.

భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, శివమ్‌ దూబే, జడేజా, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమీ

విండీస్‌: షెయ్‌ హోప్‌, సునీల్‌ ఆంబ్రోస్‌, హెట్‌మైర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, పొలార్డ్‌, జేసన్‌ హోల్డర్‌, కీమోపాల్‌, హేడన్‌ వాల్ష్‌, ఆల్జారీ జోసెఫ్‌, షెల్డన్‌ కాట్రెల్‌

- Advertisement -