భారత్‌తో దక్షిణాఫ్రికా తొలి టీ20 నేడే..

537
india vs south africa
- Advertisement -

విండీస్ పర్యటనను అజేయంగా ముగించిన కోహ్లీ సేన నేటి నుంచి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ధర్మశాల వేదికగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుండగా నాలుగేళ్ల క్రితం జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.

సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌తో 2020‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌కి సన్నద్ధతని ఆరంభించబోతోంది. ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉండటం ఇరుజట్లను కలవరపెడుతోంది.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్

- Advertisement -