టెస్ట్‌ సిరీస్‌ కూడా క్లీన్‌ స్వీప్‌..

570
india vs westindies
- Advertisement -

విండీస్‌తో వన్డే సిరీస్‌ను విజయవంతంగా ముగించింది భారత్. టెస్టు,టీ20,వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. చివరిదైన రెండో టెస్టును కూడా నాలుగు రోజుల్లోనే ముగించింది కోహ్లీ సేన.

భారత్ విధించిన 468 పరుగల లక్ష్య చేదనలో విండీస్ 210 పరుగులకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 45/2తో బ్యాటింగ్ ఆరంభించిన కరేబియన్లు ఆరంభంలో ప్రతిఘటించిన తర్వాత చేతులెత్తేశారు.

విండీస్ ఆటగాళ్లలో బ్రూక్స్ (50), బ్లాక్‌వుడ్ (38), కెప్టెన్ జాసన్ హోల్డర్ (39) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చెరో మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ రెండు, బుమ్రా ఒక వికెట్ నేల కూల్చాడు.సెంచరీ వీరుడు హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌ : 416
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌: 117
భారత్ రెండో ఇన్నింగ్స్‌ : 168/4
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ : 210

- Advertisement -