రెండో టీ20లో భారత్ ఘనవిజయం

379
India
- Advertisement -

ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. 7వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచి కొత్త సంవత్సరంలో బోణికొట్టింది టీఇండియా. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 142పరుగులు మాత్రమే చేసింది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.

143పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియా బ్యాట్స్ మెన్లు ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించారు. ఒపెనర్ కేఎల్ రాహుల్ 32బంతుల్లో 45పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గాయం నుంచి కొలుకున్న తర్వాత శిఖర్ ధావన్ నిధానంగా ఆడుతూ 23బంతుల్లో 32పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖర్లో శ్రేయస్‌ అయ్యర్‌(34), విరాట్‌ కోహ్లీ(30) జోరు బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని పూర్తి చేసి భారత్‌కు విజయాన్నందించారు. మూడు టీ20మ్యాచ్ లలో భాగంగా మొదటిది వర్షం కారణంగా రద్దవగా రెండవది ఇండియా గెలిచింది. మూడో టీ20 పుణె వేదికగా జనవరి 10న జరగనుంది.

- Advertisement -