టీమిండియాకు షాక్…ఇద్ద‌రు బౌల‌ర్లకు గాయం…

224
team india
- Advertisement -

ఐర్లాండ్ తో జ‌రిగిన రెండు టీ20ల్లో భారీ విజ‌యాన్ని సాధించింది కోహ్లి సేన‌. జులై 12వ తేది నుంచి జ‌రిగే ఇంగ్లాండ్ సిరీస్ కు స‌న్న‌ద్ద‌మ‌వుతోంది ఇండియా. మ్యాచ్ ప్రారంభంకాక‌ముందే ఇండియాకు షాక్ త‌గిలింది. భార‌త ఫేస్ బౌల‌ర్ బూమ్రా ఈ మ్యాచ్ కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ తో మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో అత‌ని ఎడ‌మ వేలికి గామ‌మ‌వ్వ‌డంతో ప్ర‌స్తుతం అత‌ను విశ్రాంతి తీసుకుంటున్నాడు.

bumra

మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యం క‌ల్లా అతని గాయం త‌గ్గుతే అత‌ని ఇంగ్లాండ్ సీరిస్ లో ఆడ‌నున్నాడు. మ‌రో బౌల‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కూడా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో పుట్ బాల్ ఆడుతూ కాలికి గాయం త‌గ‌ల‌డంతో అత‌ను కూడా మ్యాచ్ కు దూర‌మ‌వ‌నున్నాడు. గాయం కార‌ణంగా సిరీస్ దూర‌మైన ఆట‌గాళ్లు స‌మ‌యంలో కొత్త ఆట‌గాళ్ల‌కు కూడా ప్ర‌క‌టించింది బీసీసీఐ.

sundahar
వాషింగ్ట‌న్ స్ధానంలో కృనాల్ పాండ్య‌, బూమ్రా స్ధానంలో దీప‌క్ చాహ‌ర్ జ‌ట్టులోకి ఎంపిక‌య్యాడు. ప్ర‌స్తుతం ఇంగ్లాడ్ టూర్ లో ఉన్న భార‌త్-ఏ జట్టులో చాహ‌ర్ కూడా ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభ‌మ‌యే స‌మ‌యానికి బూమ్రా, సుంద‌ర్ కొల‌కుంటే వారినే ఆడించ‌నున్నారు..లేదంటే కృనాల్ పాండ్య‌, చాహ‌ర్ ను జ‌ట్టులోకి తీసుకొనున్నారు.

- Advertisement -