చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయంఃకేటీఆర్

249
KTR
- Advertisement -

చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొందరు పార్టీలు మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదన్నారు. తప్పకుండా ఈసారి చేవేళ్లలో గెలుస్తామాని హమి ఇచ్చారు. చేవేళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటబోతుందన్నారు. టీఆర్ఎస్ కు అందనంద దూరంలో ఇతర పార్టీలు ఉన్నాయన్నారు. పోటీ మనకు ఇతర పార్టీలతో లేదని మనలో మనకే పోటీ ఉందన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం చాలా వైవిధ్యమైనది. ఓవైపు రైతులు ఉన్నారు.. మరో వైపు ఐటీ నిపుణులున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపు అంటే మినీ ఇండియాను గెలిచినట్లేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -