నేడు భారత్ పాక్ మ్యాచ్ .. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు

354
IndiavPakistan
- Advertisement -

దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. నేడు సాయంత్రం మూడు గంటలకు చిరకాల ప్రత్యర్దులు తలపడనున్నారు. వరుణుడు కరుణిస్తే నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.. ఉద్వేగ భరిత దృశ్యాలకు ఖాయమే అంటున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన చరిత్ర పాకిస్థాన్‌కు లేదు. ఇదే ఆనవాయితీని కొనసాగించాలని కోహ్లీ టీమ్ పట్టుదలతో ఉంది.

మరోవైపు ఎలాగైనా టీమిండియాను ఓడించాలన్న పట్టుదలతో పాకిస్థాన్ సర్వ శక్తులను కూడగట్టుకుని పోరాటానికి సిద్ధమైంది. ఇండియా జట్టులో ఒపెనర్ ధావన్ స్దానంలో దినేష్ కార్తిక్ లేదా విజయ్ శంకర్ ను బరిలోకి దింపనున్నారు. ఇక కోహ్లి, రోహిత్, పాండ్యా , ధోని ఫామ్ లో ఉండటంతో టీంఇండియాకు ప్లస్ గా చెప్పుకోవచ్చు. . బుమ్రాతోపాటు భువనేశ్వర్‌, షమిల్లో ఎవరికి స్థానం దక్కినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే పాక్‌ బ్యాటింగ్‌ను దెబ్బ తీయడం చాలా సులభం. ఎలాగైనా ఈసారి భారత్ ను ఓడించాలని కసిగా ఉంది పాకిస్ధాన్ జట్టు.

- Advertisement -