వరల్డ్ కప్ ..సెమీస్ కు ఇంగ్లాండ్

374
england won
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు చేరింది. న్యూజిలాండ్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ లో బెర్త ఖరారు చేసుకుంది. 119 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఒపెనర్ బెయిర్ స్టో 99బంతుల్లో 119పరుగులు చేయగా జేసన్ రాయ్ 61 బంతుల్లో 60పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించారు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో బౌల్ట్‌, నీషమ్‌, హెన్నీలు తలో రెండేసి వికెట్లు తీశారు. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో టామ్ లాథం చేసిన 57 పరుగులే అత్యధికం. కెప్టెన్ విలియమ్సన్ 27, రాస్ టేలర్ 28 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకోగా, ఓడినా న్యూజిలాండ్‌కు ఆశలు సజీవంగా ఉన్నాయి. 11 పాయింట్లతో కివీస్ నాలుగో స్థానంలో ఉండగా, 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌ రేపు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

- Advertisement -