ఇబ్రహింపట్నంలోని 17,18వార్డుల్లో టీఆర్ఎస్ ఎకగ్రీవం

426
ibrahimpatanam
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 120మున్సిపాలిటీలు, 9కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉదయం 10గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులకు జై కొడుతున్నారు ప్రజలు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.

మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్దులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ జోరు కనిపిస్తుంది.  ఇక నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ లోని 17, 18 వ వార్డులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్దులను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.

- Advertisement -