CAAకి వ్యతిరేకంగా ఎంఐఎం భారీ ర్యాలీ

429
mim owisi
- Advertisement -

ఎన్ ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ నేడు హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గోన్నారు. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. తిరంగా ర్యాలీలో పాతబస్తీకి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mim Nrc

ముస్లిం సంఘాలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నాయి. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ చేపట్టారు. తిరంగా ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసి CAAకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పాతబస్తీలోని అన్ని ఇళ్లపై జాతియ జెండాలను ఎగురేసి నిరసన తెలుపుతున్నారు.

Mim Ralley

- Advertisement -