హైదరాబాద్ మెట్రోకు తప్పిన పెను ప్రమాదం

435
Hyderabad Metro
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైలు రైలు పెను ప్రమాదం నుంచి బయపపడింది. మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ కు వస్తున్న మెట్రో ట్రైన్ అనుకోకుండా పక్క ట్రాక్ లోకి వెళ్లింది. దీంతో వెంటనే గమనించిన అధికారులు ట్రైన్ ను లక్డీకాపూల్ లో ఆపేశారు. ట్రైన్ లో ఉన్న సుమారు 300మందిని ప్రయాణికులను దింపి వేరే ట్రైన్ లో ఎక్కించారు. ఆ తర్వాత ఆ ట్రైన్ ను వెనక్కి పంపించారు.

ఆ సమయంలో ఆ ట్రాక్ నుంచి వేరే ట్రైన్ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు అధికారులు. అదే ట్రాక్ మీద నుంచి వేరే ట్రైన్ వస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు అధికారులు. అదృష్టం బాగుండి ఆ సమయంలో ఏ ట్రైన్ రాకపోవడంతో ఉపిరి పిల్చుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మెట్రో అధికారులు.

- Advertisement -