గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అదనపు కమిషనర్ చౌహన్

489
Ac Chowhan
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఏసీబీ డీ.జి. పూర్ణచందర్ రావు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు హైద్రాబాద్ అదనపు కమిషనర్ డి. ఎస్.చౌహన్.

హైదరాబాద్ లోని తన కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. జాయింట్ సిపి తరుణ్ జోషి, ఐ.ఏ.ఎస్ అధికారి గౌరవ్ ఉప్పల్, ఐపీఎస్ అధికారి కమలేశ్వర్ సెంఘంన్వర్ తో పాటు అదనపు డిసిపి కృష్ణా రెడ్డి కి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -