అక్టోబర్‌ 21న హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక

612
uttam kcr
- Advertisement -

హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ స్ధానాలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని హుజుర్ నగర్ స్ధానానికి అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది.

()సెప్టెంబర్ 23న నోటిఫికేషన్
()సెప్టెంబర్ 30న నామినేషన్లకు చివరిరోజు
()అక్టోబర్ 1న స్క్రిటిని
()అక్టోబర్ 03న నామినేషన్ల విత్ డ్రా కు చివరి రోజు
()అక్టోబర్ 21న పోలింగ్
()అక్టోబర్ 24 ఓట్ల లెక్కింపు..

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉండనున్నారు.

- Advertisement -