భక్తజనసంద్రమైన మేడారం…

463
medaram
- Advertisement -

సమ్మక్క-సారలమ్మ జాతరకు వేలాదిగా తరలివస్తున్న భక్తులతో జనసంద్రంగా మారింది మేడారం . పగిడిద్దరాజును మేడారంలో గద్దెల పై ప్రతిష్ఠించనున్నారు పూజారులు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పెనుక వంశస్తులు మేడారానికి ప్రయాణం అయ్యారు. కాలినడకన 66 కి.మీ. అటవీ మార్గంలో ప్రయాణించి పగిడిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుకోనున్నారు.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలోని ప్రజలంతా తమ ఇళ్లకు మట్టిపూతలు చేసుకుని, ముగ్గులు వేసుకుంటారు. స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో పెనుక వంశస్తులు ఇంటి నుంచి ఆలయానికి తీసుకొస్తారు. అనంతరం స్వామివారిని పడగ రూపంలో అలంకరించి స్థానిక పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

శివసత్తుల పూనకాలతో డోలు వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించారు. అనంతరం పడగరూపంలో అలంకరించిన స్వామివారి ప్రతిమతో అటవీమార్గం మీదుగా కాలినడకన గిరిజనులు మేడారం బయలుదేరారు. బుధవారం రాత్రి మేడారం సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం మేడారం సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.

- Advertisement -