ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై దానకిషోర్ సమీక్ష..

242
Dana Kishore
- Advertisement -

ఈ రోజు ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఓఆర్ఆర్ 193 గ్రామాల్లో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి ఇక్కట్లు రాకుండా రూ. 1.5 కోట్లతో ప్రత్యామ్నాయ మంచినీటి ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ… ఓఆర్ఆర్ 193 గ్రామాల్లో మంచినీటి సరఫరా జలమండలే చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రానున్న వేసవిలో మంచినీటి ఇక్కట్లు రాకుండా రూ.1.5 కోట్లతో నూతనంగా 17 ఫిల్లింగ్ స్టేషన్లు, 60 మంచినీటి ట్యాంకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 15 నుంచి జలమండలి ట్యాంకర్ల సేవలు అందుబాటులోకి రావాలని సూచించారు. వీటితో పాటు ఆయా గ్రామాల్లో మంచినీటి సరఫరా, వేసవి కార్యాచరణలో భాగంగా మంచినీటి సరఫరా,రెవెన్యూపై సమీక్షించారు.

అలాగే ఓఆర్ఆర్ గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి సేకరించిన కనెక్షన్ల వివరాలకు తాత్కాలికంగా క్యాన్ నెంబర్ కేటాయించి, వివరాలను పోల్చుతూ చేసే సర్వే అనంతరం శాశ్వత క్యాన్ నెంబర్ కేటాయింపు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అలాగే ఈ నెల నుంచి వాణిజ్య కనెక్షన్ల నుంచి 100 శాతం బిల్లుల వసూలుతో పాటు కొంత మొత్తం పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవిలతో పాటు సంబంధిత సీజీఎమ్ లు, జీఎమ్ లు, డీజీఎమ్ లు, మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -