రీ షూట్ కి పారితోష‌కం అడిగిన‌ హీరోయిన్..

510
sai pallvi
- Advertisement -

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ‘పడి పడి లేచె మనసు మూవీ తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. శ‌ర్వానంద్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈసినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేర‌కుంద‌ని స‌మాచారం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు.

padi padi

ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 21న ఈమూవీ విడుద‌ల కానుంది. ఈచిత్రంలో కొన్ని సీన్స్ ను రీ షూట్ చేసే ప‌నిలో ఉన్నారు చిత్రయూనిట్. కొన్ని సీన్స్ బాగా రాక‌పోవ‌డంతో మ‌ళ్లి షూట్ చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందుకోసం హీరోయిన్ సాయిప‌ల్ల‌వి డేట్స్ ను అడిగార‌ట నిర్మాత‌లు.

padi padi leche mansu

రీషూట్ చేసే సీన్స్ కు కూడా పారితోషకం ఇవ్వాల‌ని సాయి ప‌ల్ల‌వి డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. అయితే అందుకు నిర్మాత‌లు కూడా అంగీక‌రించిన‌ట్టుగా తెలుస్తుంది. మాములుగా క‌థ‌లో బ‌లం లేక‌పోతే పారితోష‌కం ఎక్కువ ఇస్తాన‌న్న సాయి ప‌ల్ల‌వి సినిమాలు చేయ‌ద‌ని ఇండస్ట్రీలో టాక్ ఉంది . ఈసినిమా రీ షూట్ కు సాయి ప‌ల్ల‌వి డ‌బ్బులు అడ‌గ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు సినీ విశ్లేష‌కులు.

- Advertisement -