బాలీవుడ్ లోకి మహానటి…

562
Keerthy Suresh
- Advertisement -

కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో స్ధానం దక్కించుకుంది. అతి తక్కువ సినిమాల్లో నటించిన కీర్తి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో బిజీగా ఉంది. జూనియర్ , సీనియర్ తేడా లేకుండా అందరితో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది కీర్తి. తమిళ్ లో ఇటివలే విడుదలైన పందెం కోడి2, సూర్య గ్యాంగ్ మూవీలో నటించింది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ బాలీవుడ్ కు వెళ్లనుందని తెలుస్తుంది. ఇటివలే ఓ బాలీవుడ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని ఫిలీం నగర్ వర్గాల సమాచారం. ఈచిత్రాన్ని శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మించనున్నారట.

ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బధాయి హో దర్శకుడు అమిత్ శర్మ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈమూవీ లేడి ఓరియెంటేడ్ మూవీ కావడంతో చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారట చిత్రయూనిట్. చివరకు కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. బధాయిహో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈమూవీ కథలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతోనే కీర్తి ఒప్పుకుందని సమాచారం. త్వరలోనే ఈచిత్ర షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది

- Advertisement -