గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన హీరో అర్జున్‌..

580
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు సినిమా హీరో అర్జున్ తమిళనాడులోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మరో ముగ్గురిని నామినేట్ చేయడం జరిగింది. అయితే స్వయంగా రోజా వెళ్లి అర్జున్‌తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణకి సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు.

arjun

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది. దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చెప్పట్టడం చాలా అభినందనియం అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజావనంలో జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు ఆర్కే సల్వామని, మరియు ఉత్తమ నటి కుష్బూని పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -