- Advertisement -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఖతార్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో బ్యాంకాక్ నుండి దోహా వెళుతున్న ఖతార్ ఎయిర్లైన్స్ విమానాన్ని దారి మళ్లించిన పైలెట్ శంషాబాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ప్రయాణికుడిని వెంటనే ఎయిర్పోర్ట్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అయితే అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రయాణికులు మృతి చెందాడు.మృతుడు సూల్యహోయబ్ (65) గా గుర్తించారు అధికారులు.
- Advertisement -