కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై హరీష్‌రావు సమీక్ష …

228
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పంపు హౌజ్ ల నిర్మాణం 2018 మార్చ్ చివరిలోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.2018 జూన్ కల్లా మొత్తం పనులు పూర్తి చేయాలన్నారు. సోమవారం నాడు జలసౌధలో ఈ ప్రాజెక్టు పనులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన పుంపులు, మోటార్లు, ఇతర ఎలక్రో మెకానికల్ ఎక్విప్మెంటు ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. ఇండియాతో పాటు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చైనా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీ తదితర దేశాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఆయా కంపెనీలతో వొప్పందం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మేఘా సంస్థను ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సాగునీటికోసమే కాదని ప్రధమ ప్రాధాన్యత కింద హైదారాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చనుందని మంత్రి తెలిపారు.

Harish Rao Review Meeting on Kaleshwaram Project

ఈ ప్రాజెక్టుతో మిషన్ భగీరధ పథకాన్ని అనుసంధానం చేసి 2017 డిసెంబర్ కల్లా తాగు నీటి సరఫరా చేయనున్నట్టు చెప్పారు.కనుక కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లు, బ్యారేజీలను షెడ్యూలు ప్రకారం పూర్తి చేయడం కూడా తెలంగాణకు అత్యంత ముఖ్యమని హరీష్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఒక సవాలుగా తీసుకొని షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు గాను పంపులు, మోటార్లు ఇతర సాంకేతిక పరికరాలను, యంత్రాలను వీలైనంత త్వరగా సమకూర్చుకోవాలని ఏం. ఇ .ఐ .ఎల్. సంస్థను కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్ హౌజ్లకు సంబంధించిన సివిల్ పనులన్నీ వేగవంతం చేయాలన్నారు. యంత్ర పరికరాలన్నీ సకాలంలో సరఫరా చేయాలని ఆయా దేశాల మ్యానుఫ్యాక్చరర్లను మంత్రి కోరారు. వేలైనంత త్వరగా పంపులు, మోటార్లు సరఫరా చేయడంతో పాటు వాటి నాణ్యతా విషయంలో ఎలాంటి రాజీ పడరాదని ఆయన సూచించారు. చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆసియా లోనే రికార్డు నెలకొల్పాలని మంత్రి సంబంధిత ఏజన్సీలను కోరారు. 2018 జూన్ కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఖరీఫ్ సీజన్లో గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు తరలించాలన్నది సీఎం ఆకాంక్ష అని తెలిపారు.

Harish Rao Review Meeting on Kaleshwaram Project

తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కీలకమో, తెలంగాణకు ఇది జీవనాడిగా ఎలా మారనున్నదో మంత్రి వివరించారు. ఈ ప్రాజక్టు పంపుహౌజ్ ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఇదివరకే ఖరారు చేశారు. వాటికి అనుగుణంగా చేపట్టవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని ఆదేశించారు. సివిల్ పనులను పూర్తి చేయడం, మూడు పంపింగ్ స్టేషన్లలోనూ పంపులు, మోటార్ల సరఫరా, వాటి బిగింపు షెడ్యూలు, మోటార్ల టెస్టింగ్, విద్యుత్ ట్రాన్స్ మిషన్ లైన్ల ఏర్పాటు, సబ్స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ ట్రాన్స్ మిషన్ల ప్రస్తుత పరిస్తితి పై మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. డ్రై రన్ చేపట్టడానికి మొదటి పంపు ఏర్పాటు షెడ్యూలు తో పాటు ఇతర పంపుల నిర్మాణానికి సంబంధించిన షెడ్యూలు ను కూడా ఈ రోజే ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఖరారు చేయాలని మేఘా ఇంజనీరింగ్ కంపనీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు.

Harish Rao Review Meeting on Kaleshwaram Project

మొత్తం మూడు పంపింగ్ స్టేషన్ల ను వచ్చే ఏడాది మార్చ్ కల్లా పూర్తి చేయవలసిన బాధ్యత ఏం. ఇ .ఐ.ఎల్ వారిదేనని హరీష్ రావు అన్నారు. సమావేశంలో మంత్రి హరీష్ రావు తో పాటు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి,ఇ.ఎన్.సి.మురళీధర్రావు,కాళేశ్వరం సి.ఇ.ఎన్. వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, సి.ఇ.సి.డి.ఒ నరేందర్ రెడ్డి, మంత్రి ఒ. ఎస్, డి. దేశ్ పాండే పంపుల మ్యాన్యు ఫ్యాక్చర్ కంపెనీ లు యాన్ డ్రిచ్( ఆస్ట్రియా ),జైలమ్ వాటర్ సోల్యూ షన్స్ ( అమెరికా ), మోటార్ ల తయారీదారులు ఏ. బి.బి ఇండియా లిమిటెడ్ ( ఫిన్లాండ్, స్విట్జర్లాండ్), డబ్ల్యూ.ఇ.జి .ఇందస్రీస్ ( బ్రెజిల్), వాల్వ్స్ తయారీ దారులు సెవర్న్ గ్లూకోన్ ( చైనా), హూబీ హాంగ్ చెంగ్ ( చైనా) ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -