తొలిసారి బరిలో పాండ్యా బ్రదర్స్‌..

246
pandya brothers
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌లో మరో బ్రదర్స్ జోడి కలిసి బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు జింబాంబ్వే నుండి ఆండీ,గ్లాంట్ ఫ్లవర్‌,స్టీవ్ వా,మార్క్‌ వా,షాన్ మార్ష్‌,మిచెల్ మార్ష్‌ లాంటి ఆటగాళ్లు కలిసి బరిలోకి దిగారు. ఇక భారత్‌ నుండి ఇప్పటివరకు అమర్‌ నాథ్ బ్రదర్స్,పఠాన్‌ బ్రదర్స్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా చాలాకాలం తర్వాత పాండ్యా బ్రదర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి కలిసి బరిలోకి దిగనున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ వేదిక కానుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టీ20లో పాండ్యా బ్రదర్స్‌ సత్తాచూపేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ గెలుపులో వీరిద్దరు కీలకపాత్ర పోషించారు. తాజాగా తొలిసారి వీరిద్దరు కలిసి మ్యాచ్ ఆడుతుండటంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్‌ తరఫున తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన లాలా అమర్‌నాథ్‌ కుమారులైన మహిందర్‌ అమర్‌ నాథ్‌, సురీంధర్‌ అమర్‌ నాథ్‌లు భారత్‌ తరపున బ్రదర్స్‌గా తొలిసారి బరిలోకి దిగారు. తర్వాత ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో చిరస్మరణీయ విజయాలందించారు.

- Advertisement -