చెడుపై విజయమే… దీపావళి

1094
- Advertisement -

హిందువుల పండుగలలో ప్రత్యేకమైనది దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దీపావళి. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో జరుపుకొనే పండుగ. దీప అంటే దీపం, ఆవళి అంటే వరుస కాబట్టి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చిన్నా….పెద్ద.. పేదా, ధనిక అనే తారతమ్యాలు లేకుండా ఆనందంగా జరుపుకునే పండగ.

ఈ దీపావళికి ఎంతో విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. తనకు లభించిన వరంతో ముల్లోకాలను నరకాసురుడు పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు.శాంతి, మతసామరస్యానికి ప్రతీకగా నవ సమాజ నిర్మాణానికి ప్రతీకగా నిలిచే దీపావళిని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు.

Also Read:Che: “చే”..ట్రైలర్

- Advertisement -