గ్రీన్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ..

455
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో అలమటించ కూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో నేడు బోరబండలో జీహెచ్‌యంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆద్వర్యంలో పేద కుటుంబాలకు, వలస కూలీలకు ఇంటింటికీ వెళ్లి 700 భోజనం ప్యాకెట్లను అందజేయడం జరిగింది.

ఈసందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌యంసీ ఆద్వర్యంలో వీలైనంత వరకు అన్నిరకాల ఏర్పాటు చేస్తున్నపటికి కూడ ఇంకా కొంతమందికి అవసరం అయిన పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాల్సి వస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అడిగిన వెంటనే పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ తరఫున భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేయించడం చాలా గొప్ప విషయం అని అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కి బొరబండ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ అయితే పేద ప్రజలకు భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఇదే విధంగా లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనం అందజేయడం జరుగుతుంది అని డిప్యూటీ మేయర్ తెలిపారు.

green challenge team

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మనం బగుండాలని కుటుంబ సభ్యులను వదిలేసి పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి, పారిశుద్ద సభ్యులకు, డిజాస్టర్‌ మెనెజ్మెంట్‌ సభ్యులకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఎంపీ సంతోష్ అన్న స్పూర్తితో రాఘవ టీం తరపున 200 మందికి కొబ్బరి బోండాలు ఇవ్వడం జరిగింది.

- Advertisement -