సోమాజిగూడలో గవర్నర్‌..విజయవాడలో పవన్‌

369
pawan governor
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమాజిగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఓటేయడం మన విధి అని ఆయన అన్నారు.

విజయవాడలో జనసేనాని పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసే ముందు ప్రజలకు అభివాదం చేసిన పవన్ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలుపు సాధిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, నారాయణపేట్ జిల్లా శేరి వేంకటాపుర్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా వల్లూర్ గ్రామంలో ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. అబ్రహం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -