మొక్కలు నాటిన ప్రముఖ వ్యాపారవేత్త జీకే ఆనంద్..

355
MP Santhosh Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన వేంకటేశ్వర హెచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ జీఎం కె.జి.ఆనంద్ బషీర్ బాగ్ లోని హెడ్ ఆఫీస్‌లో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

green challeng

అనంతరం మరో నలుగురికి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు. అందులో మక్ధూమ్ వెంకటేశ్వర హెచరీస్ జీఎం పూణే,ప్రసన్న పేడ్ గావుకర్ జీఎం బెంగుళూరు,హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్,ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫవుల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సుబ్బరాజు,మురళి పాల్గొన్నారు.

- Advertisement -