గోదావరి బోటు…వెలికితీత

649
godavari boat
- Advertisement -

38 రోజుల తర్వాత కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును బయటకుతీశారు. ఇందుకోసం ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమించింది. నది అడుగుభాగానికి వెళ్లిన సీ డ్రైవర్స్ ఎట్టకేలకు బోటును బయటకు తీశారు. అయితే బోటు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 15వ తేదీన కచ్చలూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో బోటులో సిబ్బందితో సహా 77 మంది పర్యటకులు ఉన్నారు.  ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 12 మంది గల్లంతయ్యారు. బోటు ప్రమాదం నుంచి 26 మంది బయటపడ్డారు.

కొన్ని మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దీంతో బోటులోనే ఆ మృతదేహాలు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -