రాష్ట్రంలో గిగాస్కేల్ లియాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్..

267
SK Joshi
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గిగాస్కేల్ లియాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ ఎస్కే జోషి తెలిపారు.5 గిగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ అనుకూల ప్రాంతమన్న సీఎస్ అన్నారు.

నీతీఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్‌తో ఇవాళ వీడియో నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నద్దతను తెలిపిన సీఎస్ జోషి ప్లాంట్ ఏర్పాటుకు బాహ్యవలయ రహదారి, విమానాశ్రయ సమీపంలో 200 ఎకరాల భూమి ఉందని, విద్యుత్, నీటి రాయితీలు ఇస్తామన్న ఆయన తెలిపారు.

దేశంలోని వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అమితాబ్ కాంత్ అన్నారు. 2023 నాటికి అన్ని మూడు చక్రాల వాహనాలు ఎలక్ట్రిక్ విధానంలోకి… 2025 నాటికి అన్ని ద్విచక్ర వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలనేది కేంద్రం లక్ష్యం పెట్టుకుందన్నారు. కేంద్రం ప్రయత్నాలకు రాష్ట్రాలకు సహకరించాలని ఆయన కోరారు.

- Advertisement -