గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న గౌరవ్‌ ఉప్పల్‌

671
Gourav Uppal Green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భతమైన స్పందన వస్తోంది. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పాల్గొని మొక్కలు నాటారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ విసిరిన హరిత సవాల్‌ను గౌరవ్‌ ఉప్పల్‌ స్వీకరించి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆరు మొక్కలు నాటారు.

Gourav Uppal

ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయొచ్చన్నారు.

- Advertisement -