లండన్‌లో ఘనంగా గణపతి నిమజ్జనం..

491
ganesh nimarjanam
- Advertisement -

లండన్ నగరం లోని హౌంస్లో ప్రాంతంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు అలాగే నిమజ్జనం జరిగింది. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ సారి వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.

గణేశ్‌ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.

Ganesh Celebrations 2019 In London

‘గణపతి బప్పా మోరియా’,’జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అధ్యక్షుడు అశోక్ దూసరి ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి,నవీన్ రెడ్డి, రాకేష్ పటేల్, సత్య మాట్లాడుతూ.. హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.

గణపతి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఇక్కడ 5 వ రోజు గణపతి హోమం చేయడం జరిగింది. అదేవిధంగా పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డును ధనంజయ్ వేలం పాటలో 1360 పౌండ్స్ కి దక్కించుకోవడం జరిగింది. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. అనంతరం థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.

Ganesh Celebrations 2019

ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు మరియు తెలంగాణా అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్ ) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది దంపతులు మరియు ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

Ganesh Celebrations 2019

అధ్యక్షుడు అశోక్ దూసరి ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి, రాకేష్ పటేల్, నవీన్ రెడ్డి, సత్య మూర్తి చిలుముల, సత్యపాల్ పింగిళి,మరియు జాహ్నవి,లత కూర్మాచలం,వంశీ పొన్నం, సత్యం రెడ్డి కంది, శ్రీకాంత్ జిల్లా, విద్య, క్రాంతి, వెంకీ,రాజేష్ వాకా, భరత్ బాశెట్టి, లాస్య, శ్రీ లక్ష్మి, హరి బాబు, వెంకట్ రెడ్డి, అపర్ణ, శుశమున,విజిత రవి కిరణ్, గణేష్ పాస్తం,రవి రేటినేని, శైలజ,శ్రావ్య, వినయ్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, శ్వేతా, మహేందర్, శ్వేతా మహేందర్, రంజిత్, దీపేక్షర తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -