గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన గండ్ర..

263
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని బూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి విసరగా ఆయన ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు ఆఫీసులో మూడు మొక్కలను నాటడం జరిగింది.

Gandra venkata ramana reddy

అనంతరం ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను మరో ముగ్గురికి ఇచ్చారు. ఒక్కోక్కరు మూడు మొక్కలను నాట వలసినదిగా డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు వారిని కోరడం జరిగింది. ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత, రాజ్య సభ సభ్యులు వరంగల్ బండ ప్రకాష్‌లకు వెంకటేశ్వర్లు విసిరారు.

Gandra venkata ramana reddy

- Advertisement -