సిద్దిపేటలో మహిళా డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించిన హరీష్‌ రావు

278
Harish Rao
- Advertisement -

సిద్దిపేట పట్టణంలో నూతన నిర్మించిన  మహిళా డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. రూ. 2.50కోట్లతో భవనాన్ని నిర్మించారు. ఈసందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు డిగ్రీ కాలేజి అనేది చాలా కాలం పాటు ఎన్నికల నినాదంగానే ఉండేదన్నారు.

మహిళ డిగ్రీ కాళాశాలల ఏర్పాటుకు  ఉమ్మడి రాష్ట్రంలో చాలా సార్లు ప్రభుత్వాన్ని నిలదీశామని చెప్పారు. తెలంగాణ విద్యారంగంపై ఆనాడు శాసనసభలో నిలదిస్తే 30కళాశాలలు మంజూరు అయ్యాయన్నారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చని వణంగా తీర్చిదిద్దాలని పిలపునిచ్చారు.

- Advertisement -