టీడీపీకి షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి

375
Peddireddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పలు పార్టీల నుంచి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరికి వారు తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తున్నారు. ఇక తెలంగాణలో టీడీపీ తన పట్టును కోల్పోయిన విషయం తెలిసిందే. కీలక నేతలందరూ టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి   కూడా తాజాగా ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని.. అందుకే తాను బీజేపీలో చేరబోతున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించారు.

దీంతో తెలగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే కన్పిస్తోంది. ఇక ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ 11స్ధానాల్లో పోటీ చేసింది. అందులో కేవలం రెండు స్ధానాల్లోనే గెలిచింది. అది కూడా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో విజయం సాధించింది.

అశ్వరావుపేట నుంచి మచ్చ నాగేశ్వరరావు విజయం సాధించగా.. అదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే నాగేశ్వరరావు. అటు టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలు, క్యాడర్ మొత్తం పెద్ద ఎత్తున ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

- Advertisement -