లోకయుక్త జస్టిస్ రాములుకు శుభాకాంక్షాలు తెలిపిన రాజేశం గౌడ్

417
Lokyuktha
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర తొలి తోకయుక్తగా జస్టిస్ సీవి రాములుని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. తాజాగా CV రాములు స్వగృహంలో ఆయన్ను కలిశారు రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్. ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈసందర్భంగా జి. రాజేశం గౌడ్ మాట్లాడుతూ.. జస్టిస్ సీవి రాములు తాను కలిసి గతంలో హైకోర్టులో పనిచేసినట్లు తెలిపారు. జస్టిస్ రాములు 2002లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించినట్లు చెప్పారు. రాజేశం గౌడ్ తో పాటు మాజీ న్యాయమూర్తి నవమోహన్ రావు, టీఎస్ ఎఫ్ సీ మెంబర్ చెన్నయ్య జిస్టిస్ రాములును కలిసి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -